కొట్టాయం, నవంబర్ 15: భూసంస్కరణల సవరణ బిల్లుకు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్ ఆమోదం తెలుపకుంటే రాజ్భవన్కు రైతుల మార్చ్ నిర్వహించాలని అధికార ఎల్డీఎఫ్ నిర్ణయించిందని కేరళ సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు. కొట్టాయంలో జరిగిన ఓ కార్యక్రమంలో విజయన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్లుపై సంతకం చేయాల్సిన గవర్నర్ ఎవరికీ అర్థం కాని వైఖరి తీసుకొంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ఆరిఫ్ ఖాన్ తీరుకు వ్యతిరేకంగా రైతుల కోసం ఒక్క మాటైనా మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పక్షాలు, బీజేపీ సిద్ధంగా లేవని విమర్శించారు. ఈ సవరణ ఇడుక్కి జిల్లా ఎల్డీఎఫ్ నేతల కోసం కాదని, ప్రజల కోసమని అన్నారు.