Kedarnath | న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
పంచముఖి భోగమూర్తి పల్లకి యాత్ర సోమవారం ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 9న కేదార్నాథ్ ధామ్కు చేరుకుంటుంది. ఈ నెల 10న ఉదయం 7 గంటలకు కేదార్నాథ్ ధామ్ తలుపులు భక్తుల పూజల కోసం తెరుచుకుంటాయి.