గాలె: కెప్టెన్ దిముత్ కరుణరత్నె (132 బ్యాటింగ్; 13 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక ఆదివారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. నిషంక (56), ధనంజయ డిసిల్వా (56 బ్యాటింగ్) అర్ధశతకాలతో సారథికి సహకారం అందించారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ తరఫున అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న జెరెమీ సొలోజనో షార్ట్లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతి తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.