బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్పై వేటు వేయనున్నట్టు తెలుస్తున్నది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు సంకేతాలు పంపారు. ‘అధిష్ఠానంతో చర్చించాకే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఎవరన్నది తేలుతుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కేంద్ర నాయకత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్నది’ అని అన్నారు.