రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సిరిసిల్లకు చేరుకోనున్న అమాత్యుడు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గిఫ్ట్ఏస్మైల్ కింద జిల్లాలోని విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేస్తారు.
అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టరేట్కు చేరుకొని, ఆడబిడ్డకు కానుకగా ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్లో కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో నిర్వహిస్తున్న పోడు భూముల కమిటీ మీటింగ్కూ హాజరుకానుండగా, అధికారులు అన్ని ఏర్పాట్ల్లు చేశారు.
– రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 21 (నమస్తేతెలంగాణ)