హైదరాబాద్ : రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంపై
టీఎన్జీఓ సంఘం కేంద్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలతోపాటు ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ‘ఉద్యోగ సంఘాలపై పలు పార్టీల నాయకులు చేసిన వ్యాఖ్యలకు పట్టభద్రులు ధీటైన సమాధానం చెప్పారు. 50 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీచేస్తామన్న ప్రభుత్వ ప్రకటనను స్వాగతించారు. కేసీఆర్ పాలనకు తిరుగులేదని తేల్చి చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల విజ్ఞప్తిని మన్నించి పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణీదేవికి ఓటు వేసిన పట్టాభద్రులకు కృతజ్ఞతలు. ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం కృషి చేస్తాం. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూస్తాం’ అని కారం రవీందర్ పేర్కొన్నారు.
కాంట్రాక్టు అధ్యాపకులకు ధన్యవాదాలు : గాదె వెంకన్న
ఎమ్మెల్యేలు పల్లా , వాణీదేవి గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న,
ప్రధాన కార్యదర్శి కుమార్ ఒక ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు