లండన్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు కరోనా వైరస్ సంక్రమించింది. దీంతో ఇంగ్లండ్తో జరగాల్సిన రెండవ టెస్టుకు కేన్ దూరం కానున్నాడు. స్వల్ప లక్షణాలు ఉండడంతో.. విలియమ్సన్ గురువారం రాపిడ్ యాంటీజెన్ పరీక్ష చేయించుకున్నాడు. పరీక్షలో పాజిటివ్ వచ్చింది. దీంతో విలియమ్సన్ అయిదు రోజుల పాటు ఐసోలేషన్లో ఉండనున్నారు. శుక్రవారం నుంచి నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో రెండవ టెస్టు ప్రారంభంకానున్నది. అయితే మిగితా ప్లేయర్లు అందరూ కోవిడ్ పరీక్షలో నెగటివ్ వచ్చారు. తొలి టెస్టులో కివీస్ ఓడిన విషయం తెలిసిందే. విలియమ్సన్ స్థానంలో టామ్ లాథమ్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నారు. కొత్తగా హమిష్ రూథర్ఫోర్డ్ను జట్టులోకి తీసుకున్నారు.