పుణె: రాజస్థాన్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో హైదరాబాద్ సన్రైజర్స్ జట్టు దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. పుణెలో మంగళవారం జరిగిన ఆ మ్యాచ్లో హైదరాబాద్ మరీ స్లోగా బౌలింగ్ చేసింది. 61 రన్స్ తేడాతో ఓడిన ఆ మ్యాచ్లో సన్రైజర్స్కు మరో పెద్ద జలక్ తగిలింది. హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు జరిమానా విధించారు. స్లో ఓవర్ రేటుకు 12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. తొలిసారి ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు తప్పు చేసిందని, ఐపీఎల్ నియమావళి ప్రకారం కెప్టెన్ కేన్ విలియమ్సన్పై 12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.