లింగంపేట / తాడ్వాయి, జనవరి 18 : లింగంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో బడిబయటి విద్యార్థుల గుర్తింపు సర్వే కొనసాగుతున్నట్లు మండల విద్యాశాఖ అధికారి రామస్వామి తెలిపారు. ఆయా క్లస్టర్ల రిసోర్స్పర్సన్లు గ్రామాల్లో పర్యటించి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇప్పటివరకు 18 మంది బడిబయటి పిల్లలను గుర్తించామని, వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించనున్నామని పేర్కొన్నారు. మండలంలోని బాణాపూర్, లింగంపేట, పర్మళ్ల, భవానీపేట తదితర గ్రామాల్లో మంగళవారం సర్వే చేపట్టారు. సర్వేలో సీఆర్పీలతోపాటు ఐఈఆర్పీలు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలంలోని చిట్యాల, సంగోజివాడి గ్రామాల్లో బడి మానేసి ఇంటి వద్ద ఉంటున్న నలుగురు విద్యార్థులను మంగళవారం గుర్తించినట్లు ఇన్చార్జి ఎంఈవో రామస్వామి తెలిపారు. చిట్యాలలో వడ్ల అశోక్, గైని దుర్గాప్రసాద్, మినుకూరి కార్తీక్, సంగోజివాడిలో రాధ అనే పిల్లలు పదోతరగతి మధ్యలో మానేసి ఇంటి వద్ద ఉంటున్నట్లు గుర్తించామని తెలిపారు. సీఆర్పీలు రాజేందర్, బాలయ్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఓపెన్స్కూల్ పదో తరగతిలో చేరి చదువుకునేలా కౌన్సెలింగ్ నిర్వహించారు.