తానూర్, మే 20: ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం ఇస్తున్న కానుక కల్యాణలక్ష్మి పేదలకు అండగా నిలుస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని మహాలింగి గ్రామంలో శుక్రవారం వైకుంఠధామం, సీసీ రోడ్డును ప్రారంభించారు. బోల్సా నుంచి సిరాల రోడ్డుకు రూ.1.36 కోట్లు మంజూరు కాగా, భూమి పూజ చేశారు. బెంబర్లో రూ.2.25 లక్షలతో మైనార్టీ కమ్యూనిటీ హాల్, రూ. 2 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించా రు. రూ.9 లక్షలతో చేపట్టనున్న ‘మన ఊరు-మ న బడి’ పనులను ప్రారంభించారు.
బోరిగాం గ్రా మంలో మండలంలోని ఆయా గ్రామాల 164 మందికి రూ.16 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అంజేశారు. సీఎం కేసీఆర్ పాలనలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంతోషించే పరిస్థితులు వచ్చాయన్నారు. ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలలకు మ హర్దశ వచ్చిందన్నారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగరాబాయి, హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావు పటేల్, ఆత్మ చైర్మన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కనుగంటి పోతారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు జెల్లావార్ చంద్రకాంత్, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, తానూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు తాడేవా ర్, తహసీల్దార్ వెంకటరమణ, మండలాభివృద్ధి అధికారి గోపాలకృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ డీఈ కమలాకర్, స ర్పంచులు విఠాబాయి, భోజాబా యి, బాలాజీ, బాలాజీ, మండల ఉపాధ్యక్షుడు బొదనపొల్లా చం ద్రకాంత్ యాదవ్, నాయకులు భోజన్న, కేశవ్, విఠల్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పేదల ఆరోగ్యమే టీఆర్ఎస్ లక్ష్యం
లోకేశ్వరం, మే 20 : పేదల ఆరోగ్యమే టీఆర్ఎస్ ప్రథమ లక్ష్యమని ముథోల్ ఎమ్మెల్యే జీ విఠల్రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన లోకేశ్వరంలో ఓ ప్రైవేట్ షాప్ ప్రారంభోత్సవానికి శుక్రవారం వచ్చారు. అనంతరం మండలంలోని రాయపూర్ కాండ్లి, గడ్చాంద గ్రామాల బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. గడ్చాంద గ్రామానికి చెందిన సీహెచ్ నగేశ్కు రూ.60 వేలు, రాయపూర్ కాండ్లి గ్రామానికి చెందిన సాయన్నకు రూ.13,500 చెక్కులను పంపిణీ చేశారు. పేదల చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తున్నదన్నారు. నిరుపేదల పక్షపాతి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, వైస్ ఎంపీపీ మామిడి నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, జిల్లా సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి భుజంగ్ రావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చిన్నారావు, మొండి శ్రీధర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, జై సాగర్ రావు, దత్తు పటేల్, టీఆర్ఎస్ నాయకులు కపిల్, నాలం గంగాధర్, గ్రామస్తులు పాల్గొన్నారు.