చెన్నై: తమిళనాడులోని కల్లకురుచ్చిలో ఆత్మహత్య చేసుకున్న 12వ తరగతి విద్యార్థిని మృతదేహాన్ని ఇవాళ కడలూరు జిల్లాలోని స్వగ్రామానికి తీసుకువెళ్లారు. బంధువులు ఆమె మృతదేహానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కోర్టు విద్యార్థిని మృతదేహానికి రెండు సార్లు పోస్టు మార్టమ్ నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థిని చనిపోయిన తర్వాత కల్లకురుచ్చిలో భారీ విధ్వంసాన్ని సృష్టించారు. వందల సంఖ్యలో స్కూళ్ల బస్సులకు నిప్పుపెట్టారు. హింసను అదుపు చేసేందుకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. మృతదేహాం అప్పగింత సమయంలో విద్యార్థిని తల్లి నుంచి సంతకం తీసుకున్నారు. మృతదేహం స్వంత ఊరు చేరుకున్న తర్వాత బంధువులు, గ్రామస్థులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.