మంత్రి సత్యవతి రాథోడ్
ములుగు టౌన్, అక్టోబర్ 30: పోడు వ్యవసాయం చేస్తు న్న అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హామీఇచ్చారు. పోడు సమస్య పరిష్కారం, అడవుల సంరక్షణపై ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రాల్లో శనివారం మంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ.. పోడు చేసుకుంటున్న అర్హులందరికీ పట్టాలు ఇస్తామని తెలిపారు. నవంబర్ 8 నుంచి పోడు భూముల పట్టాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. పోడు చేసుకుంటున్న వారికి అన్యాయం జరగకూడదనే ప్రభుత్వ ఆలోచిస్తున్నదని తెలిపారు. ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, అధికారులు పాల్గొన్నారు.