హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): టీటీడీ వివిధ అంశాలపై ఉన్న ప్రతిపాదనలను పరిశీలిం చి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేసింది. ఆర్థిక, కొనుగోళ్లు, ఇంజినీరింగ్ పనులు, ఎస్టేట్స్, అప్పీల్స్, మెడికల్, హెచ్డీపీపీ ఎగ్జిక్యూటివ్, ఎస్వీబీసీ బోర్డు, విద్య తదితర అంశాలపై కమిటీలు వేసింది. పర్చేజ్ కమిటీలో జూపల్లి రామేశ్వర్రావు, ఎస్టేట్స్ కమిటీలో మన్నె జీవన్రెడ్డి, హెచ్డీపీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఎం రాములుకు రాష్ట్రం నుంచి స్థానం దక్కింది.