అమరావతి, జూన్ 17: జైలు నుంచి న్యాయమూర్తి రామకృష్ణ విడుదలయ్యారు. ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జడ్జి రామకృష్ణ విడుదలయ్యారు. చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన న్యాయమూర్తి రామకృష్ణ ఏప్రిల్ లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య ఫిర్యాదుతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదుచేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జూన్ 15న ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.