హైదరాబాద్, మే 24: ఫ్యాక్టరీ ధరలకే బంగారు ఆభరణాల్ని విక్రయించనున్నట్టు జోయాలుక్కాస్ ప్రకటించింది. హైదరాబాద్లోని తమ పంజాగుట్ట, ఇతర షోరూంలలో గోల్డ్ జ్యువెలరీ ఫ్యాక్టరీ ధరలకే లభిస్తాయని, ఎంపికచేసిన డిజైన్స్పై మజూరీ చార్జీలను చెల్లించనక్కర్లేదని, కేవలం బంగారం ధరను చెల్లిస్తే చాలునని సంస్థ తెలిపింది.
జూన్ 5 వరకూ పరిమిత సమయమే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ ప్రత్యేక ఆఫర్కు అదనంగా బై-బ్యాక్ గ్యారంటీతో పాటు జీవితకాలం ఉచిత నిర్వహణ హామీ, ఒక ఏడాది వరకూ ఉచిత బీమాను పొందవచ్చని జోయాలుక్కాస్ వివరించింది.