పార్టిసిపేటరీ నోట్స్(పీ-నోట్స్) ద్వారా దేశీయ క్యాపిటల్ మార్కెట్లోకి వచ్చే పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్ నెలలోనే రూ.1.02 లక్షల కోట్ల మేర వచ్చాయి. గత 43 నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విడుదల చేసిన నివేదిక ప్రకారం గత నెలకుగాను ఈక్విటీ, డెబిట్, హైబ్రిడ్ సెక్యూరిటీ మార్కెట్లలోకి రూ.1,02,553 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయి. వీటిలో ఈక్విటీల్లోకి రూ. 93,213 కోట్లు రాగా, డెబిట్ మార్కెట్లోకి రూ. 8,885 కోట్లు, హైబ్రిడ్ సెక్యూరిటీల్లోకి రూ. 455 కోట్లు వచ్చాయి.
పీ-నోట్స్ పెట్టుబడుల తీరు (రూ.కోట్లలో)
సెప్టెంబర్ 97,751
ఆగస్టు 97,744
జూలై 85,799
జూన్ 92,261
మే 89,743
ఏప్రిల్ 88,447
మార్చి 89,100