పటాన్ సెప్టెంబర్ 24: ఈసారి ఎన్నికల్లో బీఆర్ ప్రభంజనం ఖాయమని పటాన్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ అన్నారు. ఆదివారం పటాన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శివాజీ యూత్ అసోసియేషన్ చెందిన 50 మంది యువకులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ సమక్షంలో బీఆర్ చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదన్నారు. యువతకు చక్కటి అవకాశాలు కల్పించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన యువత బంగారు తెలంగాణ ఏర్పాటులో సైతం ముందుకు రావాలని కోరారు. యువతకు స్వ యం ఉపాధి కల్పించేందుకు రుణాలిచ్చి ప్రొత్సహిస్తున్నామన్నారు. కొత్తగా పరిశ్రమలు పెట్టెందుకు అండ గా ఉంటున్నామన్నారు. బీఆర్ కష్టపడిన వారి కి చక్కటి పదవులు వస్తాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బి.పాండు, సర్పంచ్ సుధీర్ ఎంపీటీసీ మన్నెరాజు, కార్పొరేటర్ మెట్టు కుమార్ సీనియర్ నాయకులు వెంకట్ గూడెం మధుసూదన్ నాయికొటి రాజు, అబ్బుగారి అరుణ్ శివాజీ యువజన సంఘం సభ్యులు కృష్ణ, రవి, చంద్ర, ఎ.మహేశ్, పి.మహేశ్, విజయ్ సాయికిరణ్, తేజ, శివ, అరవింద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.