మోతె, సెప్టెంబర్ 20 :వివిధ పార్టీల కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం పీఏ పల్లి మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మోతె మండలం హుస్సేన్బాద్, కరక్కాయలగూడెం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హుస్సేన్బాద్, కరక్కాయలగూడెం గ్రా మాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు 100మంది బుధవారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న అభివద్ధి, సంక్షేమం దేశమంతా అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు పార్టీ నిరంతరం అండగా ఉంటుందన్నారు. సర్కార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని అభివృద్ధి చేయడంలో దారుణంగా విఫలమయ్యాయని విమర్శించారు. దేశం చూపు సీఎం కేసీఆర్ నాయకత్వం వైపు ఉన్నదని తెలిపారు. పార్టీలో చేరిక కార్యకర్తలందరూ సభ్యత్వం తీసుకుని బీమా సౌకర్యం పొందాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు శీలం సైదులు, మాజీ ఎంపీపీ లింగారెడ్డి, జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.