కోస్గి, అక్టోబర్ 28 : కోస్గి బల్దియా పరిధిలో అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మున్సిప ల్ అధికారులపై అదనపు కలెక్టర్ చం ద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గు రువారం పట్టణంలోని మున్సిపల్ కా ర్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో నిధులు మంజూరు చేసి కౌన్సిల్ తీర్మానం చేసి టెండర్లు పిలిచినా పనులను ఎందుకు ప్రారంభించడం లేదని, కాంట్రాక్టర్లతో ఎందుకు నిర్లక్ష్యం చేయిస్తున్నారని ఏఈ విలోక్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రో జుల్లో పని తీరు మారకుంటే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బల్దియాలో అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపడుతుంటే మౌ నం వహించడం ఏమిటని కమిషనర్ మల్లికార్జునస్వామిపై మండిపడ్డారు.
అనుమతి లేని భవనాలను వెంటనే కూల్చి వే యాలని ఆయన చెప్పారు. మున్సిపల్ పరిధిలో పని చేస్తున్న సిబ్బంది నియామకం ఏ విధంగా చే శారని, 93 మందిని నియమించడం ఏమిటి, ఇం త మందికి నెలల తరబడి వేతనాలు పెండింగులో ఉండడం ఏమిటన్నారు. సిబ్బంది పూర్తి వివరా లు, అనుమతి లేని భవనాల వివరాలను శుక్రవా రం సాయంత్రం లోపు తమకు అందించాలన్నా రు. ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు పని తీరు మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సి బ్బంది పాల్గొన్నారు.