నేనే రాజు నేనే మంత్రి (Nene Raju Nene Mantri)..తేజ డైరెక్షన్లో రానా, కాజల్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. రానా (Rana Daggubati) నటించిన చిత్రాల్లో మంచి బ్రేక్ అందుకున్న సినిమా. ఈ చిత్రంలో రానా చేసిన జోగేంద్ర పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కాగా చాలా రోజుల తర్వాత జోగేంద్ర జనాల మధ్యకు రాబోతున్నాడు. అదేంటి అనుకుంటున్నారా..? త్వరలో గణేశ్ చతుర్థి నేపథ్యంలో వివిధ ఆకారాల్లో వినాయకుడి ప్రతిమలు ముస్తాబవుతున్నాయి.
అందులో ఒకటి జోగేంద్ర (Jogendra)పాత్రను స్పూర్తిగా తీసుకుని తయారు చేస్తున్న గణేశుడి విగ్రహం. సంప్రదాయక చొక్కా, పంచ వస్త్రధారణలో జోగేంద్రను పోలిన గణేశుడి స్టిల్స్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. బేగంబజార్లోని బర్టన్ బజార్లో ఫ్రెండ్స్ క్లబ్ ఇలా సినిమాటిక్ గా గణేశ్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేశారు. ఇంకా పూర్తిస్థాయిలో తయారు కానీ జోగేంద్ర గణేశుడు విగ్రహాం ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఏడాది ఆగస్టు 31న గణేశ్ చతుర్థిని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 9న నిమజ్జనం చేయనున్నారు.
సినిమా కారెక్టర్లతో వినాయక ప్రతిమలు మార్కెట్లో దర్శనమివ్వడం కొత్తేమీ కాదు. బాహుబలి, ఈగ, గబ్బర్ సింగ్ సినిమాల పాత్రల స్పూర్తిగా తయారు చేసిన గణేశుడి విగ్రహాలు ఇప్పటికే మార్కెట్లో సందడి చేశాయి.