హైదరాబాద్ : సాయిల్ టెస్టింగ్ అగ్రి స్టార్టప్ కంపెనీ కృషి తంత్ర వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించింది. ఈ మేరకు సిద్ధిపేట జిల్లా తోర్నాల అగ్రి పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న పది మంది విద్యార్థులకు గురువారం వీసీ ప్రవీణ్రావు సమక్షంలో ఉద్యోగ నియామక పత్రాలను అందించింది. అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని వీసీ సూచించారు.