శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో శనివారం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కుల్గామ్లోని అష్ముజీ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులకు సంబంధించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంటున్నది. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుందని పోలీస్ తెలిపారు. ఇదిలా ఉండగా.. బుధవారం కుల్గామ్లో భద్రతా దళాలతో జరిగిన జంట ఎన్కౌంటర్లలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF), హిజ్బుల్ ముజాహిదీన్ (HM) జిల్లా కమాండర్లతో సహా ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని గోప్లాపోరా, పోంబే ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు జరిగాయి.