హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ మొదటివిడత పరీక్ష తేదీలు మారాయి. కాస్త ముందుకు జరిగాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్లో మార్పులు చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవా రం వెల్లడించింది. ఏప్రిల్ 21 నుంచి మే నాలుగు వరకు ఆరు రోజులపాటు తొలివిడత పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. తొలి షెడ్యూల్ ప్రకా రం జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరుగాల్సి ఉన్నది. పలు బోర్డుల వార్షిక పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూ ల్లో మార్పులు చేసినట్టు ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి. అడ్మిట్ కార్డులను ఏప్రిల్ రెండోవారం నుంచి అందుబాటులో ఉంచుతామని తెలిపాయి.
నేడు పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
జేఈఈ మెయిన్ ముందుకు జరుగడంతో ఇం టర్ పరీక్షల షెడ్యూల్ మార్చాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇంటర్ పరీక్షల తేదీలపై జేఈఈ పరీక్షల ఎఫెక్ట్ పడటం ఈ ఏడాది రెండోసారి. ఈ నేపథ్యం లో ఇంటర్మీడియట్ పరీక్షల పూర్తి షెడ్యూల్ను మంగళవారం విడుదల చేస్తామని విద్యాశాఖ మం త్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
మే మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు!
ఇంటర్ వార్షిక పరీక్షలను మే మొదటి వారంలో నిర్వహించే అవకాశాలున్నాయి. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు నిర్వహిస్తారు. రెండో విడత పరీక్షలు మే 24 నుంచి 29 వరకు జరుగనున్నాయి. ఈ రెండు సెషన్ల మధ్యలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలమని అధికారులు భావిస్తున్నారు. పరీక్షలను ఏప్రిల్లోనే నిర్వహించాలని తొలుత భావించినా, విద్యార్థులు ఈ నెల రోజుల్లో పరీక్షలకు సన్నద్ధంకావడం కష్టమన్న వాదనలున్నాయి. ఇదే జరిగితే ఎస్సెస్సీ పరీక్షలు సైతం వాయిదాపడే అవకాశాలున్నాయి. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ బట్టి ఎస్సెస్సీపైనా ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు అధికారవర్గాలు పేర్కొన్నాయి.
టైంటేబుల్ ఇలా.. :-సమయం
మొదటి పీరియడ్ : – 8:00 – 8:45
రెండో పీరియడ్ :- 8:45 – 9:20
మూడో పీరియడ్ : – 9:20 – 10:00
ఇంటర్వెల్:- 10:00 -10:20
నాలుగో పీరియడ్ :- 10:20 – 11:00
ఐదో పీరియడ్ :- 11:00 – 11:40
ఆరో పీరియడ్ :- 11:40 – 12:30
పాత షెడ్యూల్..
ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీలు
కొత్త షెడ్యూల్..
ఏప్రిల్ 21, 24, 25, 29, మే1, 4 తేదీలు