న్యూఢిల్లీ : రెండోవిడత జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ను (JEE)ను ఎన్టీఏ వాయిదా వేసింది. వాస్తవానికి పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ నెల 25 నుంచి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) బుధవారం ప్రకటించింది. అయితే, ఎగ్జామ్ వాయిదాకు కారణాలను మాత్రం పేర్కొనలేదు.
జేఈఈ సెంకడ్ సెషన్కు 6.25లక్షల మంది అభ్యర్థులు హాజరుకానుండగా.. సుమారు 500 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటు చేసింది. గురువారం నుంచి అడ్మిట్కార్డులు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వివరించింది. ఇదిలా ఉండగా.. జేఈఈ తొలి సెషన్ ఎగ్జామ్స్ జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహిం, ఈ నెల 12న ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే.