పరిగి, మార్చి 31: దళితుల ఆర్థిక ఎదుగుదల కోసం అమ లు చేస్తున్న దళితబంధు సహాయంతో ఓ యువకుడు ఏకంగా జేసీబీ కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం రాళ్లగుడుపల్లికి చెందిన వినయ్కుమార్కు దళితబంధు కింద రూ.10 లక్షలు మంజూరయ్యాయి. తమ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా జేసీబీ లేదు. తమ గ్రామంలో జేసీబీ అందుబాటులో ఉంటే ఉపాధి దొరుకుతుందని, ఆర్థికంగా ఎదగవచ్చని భావించారు సదరు లబ్ధిదారు. దళితబంధు కింద రూ.10 లక్షలు, తన పొలాన్ని ముద్ర రిజిస్ట్రేషన్ ద్వారా రూ.25 లక్షలు, మరికొంత డబ్బులు కలిపి మొత్తం రూ.36 లక్షలకు జేసీబీ కొనుగోలుకు నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు అధికారులను సంప్రదించగా వారు సైతం అంగీకరించారు. లబ్ధిదారు సరికొత్త ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు.