మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మూడ్రోజుల మహిళా బంధు కార్యక్రమంలో రెండోరోజు సోమవారం సన్మాన కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో పలువురు నాయకులు పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్, మార్చి 7 : మహిళలు ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్నారని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీ కట్టారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ లీలావతి, ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, పారిశుధ్య మహిళా కార్మికులకు చీరెలు అందజేసి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు ఏవీ.కిరణ్కుమార్, మహిళా నాయకురాలు సిద్దుల పద్మ, వార్డు అధ్యక్షుడు గాదె శ్రీనివాస్, నాయకులు చెన్న మహేశ్, గౌరీశంకర్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. పట్టణంలోని నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు, సిబ్బందిని మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్గౌడ్ సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చందుపట్ల రాజేశ్వర్రావు, ఏఎంసీ డైరెక్టర్లు హీరేకార్ రమేశ్, బోయపల్లి కేశవరెడ్డి, జెల్లా వెంకటరమణ, జెల్ల పుండరీకం, కార్యదర్శి అంజిత్రావు, సూపర్వెజర్ రాజీవ్కుమార్, సిబ్బంది ఆయూబ్, రవీందర్, శ్రీనివాస్, ప్రవీణ్, వెంకటేశ్ పాల్గొన్నారు. మండలంలోని కూనూ రు గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పాశం మహేశ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.
ఆలేరు / ఆలేరు రూరల్ : టీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు సీస మహేశ్వరి ఆధ్వర్యంలో నాయకులు పట్టణంలోని ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు పండ్లు, కుంకుమ భరణెలు అందించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, వైస్ చైర్మన్ నాగరాజు, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్, కౌన్సిలర్లు, మహిళా నాయకులు పాల్గొన్నారు. మండలంలోని కొలనుపాకలో మహిళా విభాగం మండల అధ్యక్షురాలు అనసూయ ఆశలు, వీబీకేలను ఘనంగా సన్మానించారు.
యాదగిరిగుట్ట రూరల్ : మండలంలోని చొల్లేరు గ్రామంలో జడ్పీటీసీ తోటకూరి అనూరాధ వార్డు సభ్యులు, ఉపాధ్యాయురాళ్లు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలకు వాయినాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అరుణ, సర్పంచ్ బీరయ్య పాల్గొన్నారు.
రాజాపేట : మండలంలోని రాజాపేట, రేణికుంట, పుట్టగూడెం గ్రామాల్లో ఆశ, అంగన్వాడీ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పుట్టగూడెంలో గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, సర్పంచులు ఈశ్వర్వమ్మ, బూర్గు భాగ్యమ్మ, రాణి పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మహిళా బంధు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన మాజీ ఎంపీపీలు కాంబోజు భాగ్యశ్రీ, ప్రతికంఠం హేమలత, ఎంపీటీసీ యాస కవిత, సాయి సేవా సమితి అధ్యక్షురాలు బీసు ధనలక్ష్మి, సహకార సంఘం డైరెక్టర్ పుట్ట నిర్మలతో పాటు ఇతర మహిళలను టీఆర్ఎస్ కార్యాలయంలో సన్మానించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని తాసీల్దార్ జయమ్మ, మహిళా పోలీసులు, పీహెచ్సీ ఆరోగ్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ కోరె భిక్షపతి, టీఆర్ఎస్ మండల కార్యదర్శి సోలిపురం రాంరెడ్డి, రైతు విభాగం మండలాధ్యక్షుడు పుట్ట నర్సిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి యశ్వంత్కుమార్, జిల్లా నాయకులు భానుప్రకాశ్, మహిళా విభాగం మండల నాయకులు లక్ష్మి పాల్గొన్నారు.
తుర్కపల్లి : మండలంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మహిళలు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీలు కట్టడంతో పాటు కేక్ కట్ చేశారు. అదేవిధంగా ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, మహిళా ప్రజాప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్, ఎంపీటీసీ కోమటిరెడ్డి సంతోష, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తిపాటి మంజుల, సర్పంచ్ బింగి మీన, లావణ్య, ఏఓ దుర్గేశ్వరి, ఏఎన్ఎం అనూరాధ పాల్గొన్నారు.
మోటకొండూర్ : మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్, విశ్వశాంతి, సెయింట్పీటర్స్ పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు బొలగాని నాగమణిమెహన్గౌడ్ జడ్పీటీసీ పల్లా వెంకట్రెడ్డితో కలిసి విద్యార్థులకు బహుమతులు అందించారు. అదేవిధంగా మండలంలోని కాటేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళలకు ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మంత్రి రాజు పాల్గొన్నారు.
వలిగొండ : మండలంలోని లింగరాజుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, మహిళా వార్డు సభ్యులను సర్పంచ్ బొడ్డుపల్లి ఉమాకృష్ణ ఆధ్వర్యంలో సన్మానించారు.
బీబీనగర్ : మండలంలోని రాయరావుపేటలో సర్పంచ్ బొర్ర సంతోషారమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ ఎరుకల సుధాకర్గౌడ్ పాల్గొని మట్లాడారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ఆశ కార్యకర్తలను సన్మానించారు.
అడ్డగూడూరు : మండలంలోని కేజీబీవీ పాఠశాలలో గురుకుల, కేజీబీవి పాఠశాల ప్రిన్సిపాళ్లు, ఏఓ అరుణకుమారిని సన్మానించారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారి ఇంటికి వెళ్లి సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్ : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మహిళా సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయడంతో పాటు సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సూరజ్కుమార్, ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ రాకేశ్రావు పాల్గొన్నారు.
రామన్నపేట : మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, పారిశుధ్య కార్మికులు, ఐకేపీ, మహి ళా సంఘాల మహిళలను టీఆర్ఎస్ మండల నాయకులు సన్మానించారు. ఎంపీపీ కన్నెబోయిన జ్యోతిబలరాం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్మోహన్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఉదయ్రెడ్డి పాల్గొన్నారు.
మోత్కూరు : మున్సిపల్ కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారద, ఐసీడీఎస్ సూపర్వైజర్ మంగమ్మ పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులను పాఠశాల యజమాన్యం ఘనంగా సన్మానించింది.
బీబీనగర్ (భూదాన్పోచంపల్లి) : భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి పాల్గొన్నారు.
గుండాల : మండల పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ టీచర్లను సన్మానించారు. ఎంపీపీ తాండ్ర అమరావతీశోభన్బాబు, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండీ.ఖలీల్, ఎంపీటీసీ కుంచాల సుశీలాఅంజిరెడ్డి పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : మండలంలోని తాజ్పూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.