దేవరుప్పుల, మార్చి 31 : పార్టీ సంస్థ్ధాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పూర్తికాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశాల మేరకు గ్రామాల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం మండలంలోని మన్పహాడ్, రామరాజుపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ కమిటీలకు ఎన్నికలు నిర్వహించారు. మన్పహాడ్ గ్రామ అధ్యక్షుడిగా వేల్పుల ఐలయ్య, ప్రధానకార్యదర్శిగా బస్వ రవి, ఉపాధ్యక్షుడిగా పీ సోమయ్య, యూత్ అధ్యక్షుడిగా చింతకింది సోమయ్య, ప్రధాన కార్యదర్శిగా దానం అరవింద్, ఉపాధ్యక్షుడిగా జోగు సోమరాజును ఎన్నుకున్నారు. రామరాజుపల్లి గ్రామశాఖ అధ్యక్షుడిగా తోకల రాజు, ప్రధాన కార్యదర్శిగా బోయిని కుమార్, ఉపాధ్యక్షుడిగా ఉప్పునూతుల నాగరాజును ఎన్నుకున్నారు. మన్పహాడ్ గ్రా మ ఇన్చార్జిగా మండల యూత్ అధ్యక్షుడు చింత రవి, రామరాజుపల్లి గ్రామ ఇన్చార్జిగా మండల నాయకుడు కుతాటి నర్సింహులు ఎన్నికలు నిర్వహించారు. పరిశీలకులుగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, పల్లా సుందరరాంరెడ్డి, ఈదునూరి నర్సింహారెడ్డి, కారుపోతుల భిక్షపతి, ఖాసీం, సంజీవరెడ్డి వ్యవహరించారు.