అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చంద్రబాబు ఈరోజు తన ట్విటర్లో ట్వీట్ చేశారు. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నానని ఇటీవల తనను కలిసిన వారంతా వీలైన త్వరగా కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని బాబు సూచించారు. చంద్రబాబు ట్వీట్కు స్పందించిన వైఎస్ జగన్ త్వరగా, ఆరోగ్యంగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు.