ముంబై : బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం సమన్లు జారీ చేసింది. సుకేష్ చంద్ర కేసులో నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఈ నెల 18న ఢిల్లీలోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్, లీనాపాల్పై విచారణకు సంబంధించి జాక్వెలిన్ స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. గతంలోనూ ఈ కేసులో జాక్వెలిన్ను సాక్షిగా విచారించారు. ఇంతకు ముందు ఆగస్ట్ 30న ఈడీ ఎదుట విచారణకు హాజరైంది. ప్రస్తుతం జాక్వెలిన్ అక్షయ్ కుమార్తో ‘రామ్ సేతు’ చిత్రంలో నటిస్తుండగా.. షూటింగ్ ఊటీలో జరుగుతున్నట్లు ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపింది. ఇదిలా ఉండగా.. ఈ వారం మొదటల్లో ఇదే కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహిని సైతం ఈడీ విచారణకు పిలిచింది.