లండన్, ఏప్రిల్ 4: టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. గ్లూకోజ్ లెవల్స్ తగ్గినట్టు అనిపిస్తే, వాటిని యథాస్థితికి తీసుకురావడానికి కార్బొహైడ్రేట్స్, చక్కెర పదార్థాలను సమయానుగుణంగా తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను కచ్చితత్వంతో తెలుసుకోవడానికి చాలామంది ఫింగర్ ప్రిక్ (వేలి నుంచి రక్తాన్ని తీయడం) విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల సమయంతో పాటు శారీరకంగా కూడా బాధ కలుగుతుంది. అందుకే దీనికి పరిష్కారంగా ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు ‘లైఫ్-చేంజింగ్ ఆర్టిఫిషియల్ పాంక్రియాస్’ పేరిట ఓ పరికరాన్ని తీసుకొచ్చారు. ఈ పరికరంలో ఉన్న సెన్సర్ రక్తంలోని చక్కెర స్థాయిలను ఓ ప్రత్యేక వైర్లెస్ పంప్కు పంపిస్తుంది. ఆ సిగ్నళ్లను విశ్లేషించిన ప్రత్యేక పరికరం.. ఎంత మోతాదులో ఇన్సులిన్ అవసరమో మొబైల్ ఫోన్కు మెసేజ్ రూపంలో పంపిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్లో 900 మంది రోగులపై ఈ పరికరాన్ని పరీక్షించగా.. కచ్చితమైన ఫలితాలు వచ్చినట్టు పరిశోధకులు తెలిపారు.