ముంబై: దేశంలోని వాణిజ్య సంస్థలు టెక్నాలజీ కోసం భారీ పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఐటీ-బీపీఎం పరిశ్రమకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో ఇందులో నియామకాల జోరందుకుంది. ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (ఐటీ-బీపీఎం) పరిశ్రమలో ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో 3.75 లక్షల కొత్త నియామకాలు జరుగుతాయని స్టాఫింగ్ సర్వీసెస్ సంస్థ టీమ్లీజ్ డిజిటల్ విడుదల చేసిన రిపోర్ట్ వెల్లడించింది. 2022 మార్చికల్లా ఈ రంగంలో ఉద్యోగుల సంఖ్య 44.7 లక్షల నుంచి 48.5 లక్షలకు చేరుతుందని తెలిపింది. 100కుపైగా కంపెనీల యాజమాన్యాలు, హెచ్ఆర్ లీడర్లను ఇంటర్వ్యూ చేసి ఈ రిపోర్ట్ రూపొందించినట్లు టీమ్లీజ్ వివరించింది.