శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్రవారం ఉదయం హ్యూమన్ రేటెడ్ సాలిడ్ రాకెట్ బూస్టర్ (HS 200)ను విజయవంతంగా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 7.20 గంటలకు బూస్టర్ టెస్ట్ ఫైర్ నిర్వహించారు. ఈ బూస్టర్ను గగన్యాన్ కోసం ఇస్రో సిద్ధం చేస్తున్నది. టెస్ట్ ఫైర్ విజయవంతంతో గగన్యాత్రలో ఇస్రో ముందడుగు వేసింది. బూస్టర్ ఇంజిన్ జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎంకే-3 (GSLV Mk-III) రాకెట్లో భాగం. ఇది భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నది. హెచ్ఎస్ 200 బూస్టర్ను 135 సెకన్ల పాటు టెస్ట్ ఫైర్ నిర్వహించారు.
(2/2) HS200 rocket booster is the human-rated version of the well-proven S200 rocket booster of GSLV Mk III satellite launch vehicle. This full-duration test of the first stage of the launch vehicle marks a major milestone for the Gaganyaan. pic.twitter.com/zT2t3ACBG8
— ISRO (@isro) May 13, 2022