అహ్మాదాబాద్: వెస్టిండీస్తో ఆదివారం జరగనున్న తొలి వన్డేలో తనతో పాటు ఇషాన్ కిషన్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఇషాన్ కిషన్ ఒక్కడే మనకు ఆప్షన్గా ఉన్నాడని, తనతో పాటు ఓపెనింగ్ బ్యాటింగ్ చేయనున్నట్లు రోహిత్ చెప్పాడు. మయాంక్ అగర్వాల్ జట్టులో చేరాడని, కానీ అతను ఇంకా ఐసోలేషన్లో ఉన్నట్లు రోహిత్ తెలిపాడు. క్వారెంటైన్ ముగియలేదు కాబట్టి, అతన్ని తుది జట్టులోకి తీసుకోవడం లేదన్నాడు. ప్రస్తుతం ఇండియన్ జట్టులో శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, నవదీప్ సైనీ, రుతురాజ్ గైక్వాడ్లు కూడా కరోనా పరీక్షలు పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. అహ్మాదాబాద్లోని మోదీ స్టేడియంలోనే 9, 11 తేదీల్లో మిగితా వన్డేలు జరగనున్నాయి.