న్యూఢిల్లీ, జూన్ 27: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నూతన చైర్మన్గా ఐఆర్ఎస్ అధికారి నితిన్ గుప్తా నియమితులయ్యా రు. 1986 బ్యాచ్ కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి గుప్తాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నియామకానికి అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏప్రిల్ 30న పదవీ విరమణ చేసిన జేపీ మోహాపాత్ర స్థానంలో పూర్తి స్థాయి చైర్మన్గా కేంద్రం నియమించడం ఇప్పుడే.