హైదరాబాద్, మే8 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ విమరణ పొందిన చీఫ్ ఇంజినీర్ల స్థానంలో ఇతర అధికారులకు పూర్తిస్థా యి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సాగునీటిపారుదలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ సీఈగా విధులు నిర్వర్తిస్తున్న విష్ణు ప్రసాద్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు.
ఆయన స్థానంలో జగిత్యాల ఇరిగేషన్ సర్కిల్లో ఎస్ఈగా విధులు నిర్వర్తిస్తున్న అశోక్కుమార్కు వరంగల్ సీఈగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు. మంచిర్యాల సీఈ గడ్డం శ్రీనివాస్ విరమణ పొందగా, ఆయన స్థానంలో సంగారెడ్డి ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ మురళీధర్కు అదనపు బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా పలువురు ఎస్ఈలు, ఈఈలు విరమణ పొందగా, వారి స్థానంలో ఇతర అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఇరిగేషన్శాఖ ఉత్తర్వులు జారీచేసింది.