హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కింద సాగవుతున్న వరిపంట ఎండిపోకుండా మరో 10 రోజులపాటు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
సూర్యాపేట జిల్లాలో కొన్నిచోట్ల చివరి భూములకు సరిపడా నీరందించాలని రైతులు కోరుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూడాలన్నారు.
కరీంనగర్ ఎల్ఎండీ నుంచి డీబీఎం -71 పరిధిలోని కాల్వ చివరి భూములకు కాళేశ్వరం నీటిని అందించాలని ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్ శంకర్ను సీఎం ఫోన్లో ఆదేశించారు.