న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 లీగ్లో పాల్గొన్న మరో ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. సిరీస్లో భారత మాజీ క్రికెటర్లు ఇండియా లెజెండ్స్కు ప్రాతినిధ్యం వహించారు. భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్కు కొవిడ్-19 పాజిటివ్గా తేలింది.
‘నాకు ఎలాంటి లక్షణాలూ లేవు. పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నా. ఇటీవల నాతో కాంటాక్ట్ అయిన వారు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోండి. ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించాలని’ ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ఆ సిరీస్లో పాల్గొన్న సచిన్ టెండూల్కర్, యూసుఫ్ పఠాన్, సుబ్రమణ్యం బద్రీనాథ్కు ఇప్పటికే కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే.
సన్రైజర్స్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..వార్నర్ వచ్చేస్తున్నాడోచ్!
కొత్త కొత్తగా..పంజాబ్ కింగ్స్ జెర్సీ
బబుల్ నుంచి బయటపడిన కోహ్లి.. ఇంట్లో ఫొటో షేర్ చేసిన కెప్టెన్