చెన్నై: మరో పదిరోజుల్లో క్రికెట్ సంబురం ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంకానుంది. లీగ్లో పాల్గొనే ఆటగాళ్లందరూ తమ జట్లలో చేరుతున్నారు. ఐపీఎల్ కోసం ఆస్ట్రేలియా నుంచి బయలుదేరే ముందు సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన కుటుంబంతో గడిపాడు. తన పిల్లలతో కలిసి విందు కూడా చేసి వాళ్లతో ఎంజాయ్ చేశాడు.
‘నేను బయలుదేరే ముందు నా అందమైన అమ్మాయిలతో కలిసి డిన్నర్ చేశాను. దురదృష్టవశాత్తు ఇస్లా మెలకువగా లేకపోవడంతో మాతో రాలేకపోయిందని’ వార్నర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.
బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం లీగ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లందరూ వారం రోజుట పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. ఇప్పటికే కొన్ని జట్లు ప్రాక్టీస్ ప్రారంభించాయి.చెన్నై వేదికగా
ఏప్రిల్ 11న కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో హైదరాబాద్ తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
కొత్త కొత్తగా..పంజాబ్ కింగ్స్ జెర్సీ
బబుల్ నుంచి బయటపడిన కోహ్లి.. ఇంట్లో ఫొటో షేర్ చేసిన కెప్టెన్