లక్నో, మార్చి 30: రైలు ప్రయాణికులకు మిల్లెట్స్తో తయారు చేసిన ఆహారాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఐఆర్సీటీసీ వెల్లడించింది.
ఆహారానికి సంబంధించిన మెనూలో వీటిని చేర్చాలని ఇప్పటికే ఉత్తరప్రదేశ్లోని సిబ్బందికి సూచించామని తెలిపింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లోని ఐఆర్సీటీసీ క్యాంటీన్లలోనూ మిల్లెట్స్ (చిరుధాన్యాలు)తో తయారు చేసిన ఆహారాన్ని అందించాలని ఆదేశించినట్టు పేర్కొంది.