IPS Officer Nupur Prasad | దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు నేతృత్వం వహించిన ప్రముఖ ఐపీఎస్ అధికారి నూపుర్ ప్రసాద్ను ప్రతిష్టాత్మకమైన ‘మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్’ (MSM) వరించింది.
2007 బ్యాచ్కు చెందిన ఏజీఎండీయూటీ (AGMUT) క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన నూపుర్ ప్రసాద్.. సీబీఐలో తన సర్వీస్ పూర్తి చేసుకుని ఇటీవల తిరిగి ఢిల్లీ పోలీసు విభాగంలోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీ పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం (EOW) జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక నేరాల నిరోధం, దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ మరియు పరిపాలనా రంగంలో ఆమె కనబరిచిన ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. తన సుదీర్ఘ ప్రయాణంలో ఆమె ఢిల్లీ పోలీస్, సీబీఐ, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. వీటితో పాటు మహిళల రక్షణ, సైబర్ భద్రత, డ్రగ్స్ నిరోధక కార్యక్రమాలలోనూ ఆమె చురుకైన పాత్ర పోషించారు. మరోవైపు 2020 జూన్ 14న ముంబైలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించిన ఘటనకు సంబంధించి జరిగిన సీబీఐ దర్యాప్తునకు ఆమె పర్యవేక్షకురాలిగా వ్యవహరించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.