LIC IPO | వచ్చేనెలలో ఐపీవోకు వెళ్లనున్న కేంద్ర ప్రభుత్వ బీమా రంగ సంస్థ.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) చైర్మన్ ఎంఆర్ కుమార్ సంచలన విషయం చెప్పారు. ఐడీబీఐ బ్యాంకులో పూర్తి వాటాను తాము విక్రయించడం లేదని స్పష్టం చేశారు. బ్యాంకుకు ఉన్న భారీ శాఖల నెట్వర్క్ను తమ బీమా సేవల మార్కెటింగ్కు ఉపయోగించుకుంటామని సోమవారం మీడియాకు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ.. ఎల్ఐసీలో ఐదు శాతం వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. తద్వారా 800 కోట్ల డాలర్ల నిధులు సమకూర్చుకోవాలని కేంద్రం తలపోస్తున్నది.
2019లో ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాను ఎల్ఐసీ కొనుగోలు చేసింది. ఐడీబీఐలో మాకు కొంత వాటా ఉంటుంది. బీమా, బ్యాంకింగ్ రంగ సేవల్లో ఐడీబీఐ బ్యాంక్ శక్తిమంతమైన కంట్రిబ్యూటర్. తాము గెలవడానికి చానెల్గా ఉపకరిస్తుందన్నారు ఎంఆర్ కుమార్.
కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీ సంయుక్తంగా ఐడీబీఐ బ్యాంకులో 90 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నాయి. ఆస్తుల విలువ డిసెంబర్ నెలాఖరు నాటికి రూ.2,90,000 కోట్లు (38.91 బిలియన్ డాలర్లు). దేశవ్యాప్తంగా 1800కి పైగా శాఖలు ఉన్నాయి. మొండి బకాయిలతో ఐడీబీఐ బ్యాంకు కష్టాల్లో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టి ఎల్ఐసీ టేకోవర్ చేసింది.