ముంబై: ఐపీఎల్ 2022 ప్రస్తుతం కొద్ది మంది ప్రేక్షకుల మధ్య నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ముంబై, పుణె స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. మూడేళ్ల తర్వాత ఈ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వల్ల గడిచిన రెండేళ్ల ఐపీఎల్లో ఎటువంటి వేడుకను నిర్వహించలేదు. అయితే ఈ ఏడాది క్లోజింగ్ సెర్మనీ నిర్వహణకు సంబంధించిన బిడ్లను బీసీసీఐ ఆహ్వానించింది. దీనికి సంబంధించిన ప్రకటనను ఐపీఎల్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆసక్తిగల వారు ముగింపు వేడుకల నిర్వహణకు బిడ్డింగ్ వేయాలని ఓ లేఖలో బీసీసీఐ కార్యదర్శి షా కోరారు.
🚨 NEWS 🚨: BCCI announces release of Request for Proposal for Staging the Closing Ceremony of IPL 2022. #TATAIPL
More Details 🔽https://t.co/uyN6sFY2Hl pic.twitter.com/6kXTcXN8ZR
— IndianPremierLeague (@IPL) April 16, 2022