న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మార్చి 26 నుంచి మే 29 వరకు జరుగనుంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఈసారి లీగ్ను ముంబై, పుణె నగరాలకు పరిమితం చేస్తున్నారు. గురువారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను లీగ్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మీడియాకు వివరించాడు. ‘లీగ్లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేరికతో మ్యాచ్ల సంఖ్య 74కు చేరుకుంది. ఇందులో 70 మ్యాచ్లు వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్, గహుంజే స్టేడియాల్లో జరుగుతాయి. మహారాష్ట్ర ప్రభుత్వ కొవిడ్-19 నిబంధనలు అనుసరించి స్టేడియాల్లో 40 శాతం ప్రేక్షకులను అనుమతిస్తాం. పరిస్థితులు అనుకూలిస్తే… పూర్తి స్థాయిలో ఫ్యాన్స్కు అనుమతిచ్చే చాన్స్ ఉంది. ప్లేఆఫ్స్పై ఇంకా నిర్ణయానికి రాలేదు..అహ్మదాబాద్లో జరిగే అవకాశముంది’ అని బ్రిజేష్ అన్నాడు.