IPL 2023: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL పదహారో సీజన్ మరో 11 రోజుల్లో ప్రారంభం కానుంది. ఆరంభ మ్యాచ్లో అదరగొట్టాలనుకున్న ఢిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్(Gujarat Titans)కు షాకింగ్ న్యూస్. అదేంటంటే..? ఆ జట్టు స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ (David Miller) సీజన్ తొలి మ్యాచ్కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని అతను తాజాగా వెల్లడించాడు. ‘అహ్మదాబాద్లో ముఖ్యంగా ఐపీఎల్ ఆరంభ పోరులో ఆడడం ఎంతో ఆనందాన్నిస్తుంది. కానీ, నా నిర్ణయంతో గుజరాత్ టైటన్స్ నిరాశ చెంది ఉంటుంది.
తొలి మ్యాచ్లో ఆడలేకపోతున్నందుకు నేను కూడా కొంత అప్సెట్ అవుతున్నా. నాతో పాటు మరికొందరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్కు అందుబాటులో ఉండడం లేదు. ఎందుకంటే.. నెదర్లాండ్స్తో రెండు వరల్డ్ కప్ సూపర్ లీగ్ (డబ్ల్యూసీఎస్ఎల్) మ్యాచులు ఉన్నాయి’ అని మిల్లర్ తెలిపాడు.
మార్చి 31న మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. ఏప్రిల్ 2న వాండరర్స్ టీమ్ను సఫారీ జట్టు ఢీకొననుంది. అయితే.. ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలు కానుంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ ఎదురుపడనున్నాయి. దాంతో, మిల్లర్తో పాటు మరికొందరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ తొలి మ్యాచ్కు దూరం కానున్నారు. సఫారీ జట్టు 2023 వన్డే వరల్డ్ కప్కి అర్హత సాధించాలంటే కచ్చితంగా ఈ రెండు వన్డేల్లో గెలవాలి. గత సీజన్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ ఐపీఎల్ విజేతగా అవతరించిన విషయం తెలిసందే.