సీసీసీ నస్పూర్ : టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో చురుకైనా పాత్ర పోషించిన నస్పూర్ మున్సిపాలిటీకి చెందిన బేర సత్యనారాయణ తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. శుక్రవారం హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేశారు. ప్రస్తుతం బేర సత్యనారాయణ మున్సిపాలిటీలోని 21వ వార్డు బీజేపీ కౌన్సిలర్గా కొనసాగుతున్నారు. ఆయనతో పాటు 18వ వార్డు బీజేపీ కౌన్సిలర్ కోడూరి లహరివిజయ్ , ఎంబడి అంజయ్య, రంగు అరుణ్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీఆర్ఎస్ ఉద్యమంలో చురుకైనా పాత్ర వహించిన బేర సత్యనారాయణకు ఉద్యమ నేత కేసీఆర్తో మంచి అనుబంధం ఉంది. కొన్ని కారణాలతో ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీలో చేరి మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంతరం బీజేపీలో చేరి, 21వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందాడు. శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే దివాకర్రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు.
సొంత పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని బేర సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్రావు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.