భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్ తొలి పోరులో పరాజయం పాలైన భారత జట్టు.. రెండో మ్యాచ్లో రెట్టింపు బలంతో విజృంభించింది. గురువారం పూల్-బిలో భాగంగా జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 13-1తో కెనడాను చిత్తు చేసింది. గత మ్యాచ్ ‘హ్యాట్రిక్’హీరో సంజయ్.. వరుసగా రెండో మ్యాచ్లోనూ ట్రిపుల్ గోల్స్ (17వ, 32వ, 59వ ని.ల్లో) నమోదు చేస్తే.. అరైజీత్ సింగ్ (40వ, 50వ, 51వ ని.ల్లో) హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఆట ఆరంభం నుంచి మనవాళ్లు ప్రత్యర్థి పోస్ట్పై దండయాత్ర ప్రకటించడంతో కెనడా ఉక్కిరిబిక్కిరి అయింది. సంజయ్, అరైజీత్తో పాటు ఉత్తమ్ సింగ్ (3వ, 47వ ని.ల్లో), శారదానంద (35వ, 53వ ని.ల్లో), కెప్టెన్ వివేక్ సాగర్ ప్రసాద్ (8వ ని.), మణిందర్ సింగ్ (27వ ని.), అభిషేక్ లక్రా (55వ ని.) రాణించారు. గత మ్యాచ్లో తుదికంటా పోరాడి చివరి నిమిషాల్లో పరాజయం పాలైన భారత్.. ఈసారి ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా దుమ్మురేపింది. శనివారం జరుగనున్న పోరులో పోలాండ్తో భారత్ తలపడనుంది.