హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ మల్టీబ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్స్పైర్ బ్రాండ్స్ హైదరాబాద్లో తమ సపోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెస్టారెంట్ టెక్, డిజిటల్ టెక్, ఎంటర్ప్రైజ్ డాటా తదితర నాలుగు రంగాల్లో ఇది సేవలను అందిస్తున్నది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందంతో ఇన్స్పైర్ బ్రాండ్స్ ప్రతినిధులు వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో తమ సపోర్ట్ సెంటర్ను నెలకొల్పనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో వ్యాపార అవకాశాలు, అనుకూలతలను వివరించారు. అమెరికాకు చెందిన 40 బిలియన్ డాలర్ల ఇన్స్పైర్ బ్రాండ్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 32 వేల శాఖలను కలిగి ఉన్నది. ఆర్బేస్, బాస్కిన్-రాబిన్స్, బఫెలో వైల్డ్ వింగ్స్, డంకిన్, జిమ్మీ జాన్స్, రస్టీ టాకో, సోనిక్ తదితర బ్రాండ్లు ఇన్స్పైర్ సంస్థకు చెందినవి కావడం విశేషం.
మంత్రి కేటీఆర్ హర్షం
హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్స్పైర్ బ్రాండ్ సుముఖత వ్యక్తం చేయడంపై మంత్రి కేటీఆర్ హర్షం చేశారు. దావోస్ నుంచి మరో శుభవార్త అంటూ అందుకు సంబంధించిన విషయాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 70 దేశాల్లో 32వేల బ్రాంచ్లను కలిగిన ఇన్స్పైర్ బ్రాండ్స్ సంస్థ హైదరాబాద్లో సపోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వివరించారు.