గుడిహత్నూర్, డిసెంబర్ 27 : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని చేపట్టిందని టీఎస్ఈడబ్ల్యూ ఐడీసీ చైర్మన్ శ్రీధర్రెడ్డి అన్నారు. మండలంలోని కొల్హారి గ్రామంలోని జడ్పీ పాఠశాలలో కొనసాగుతున్న పనులను మంగళవారం పరిశీలించారు. తాగునీరు, కిచెన్ షెడ్, మరుగుదొడ్లు, తరగతి గదులు, పెయింటింగ్ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ విద్యా సంవత్సరమే పదో తరగతి క్లాసులు ప్రా రంభం కావడంతో టెన్త్ క్లాస్ విద్యార్థులు ఆయనకు కుమ్రం భీం చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, డీఈవో ప్రణీత, సర్పంచ్ గిత్తె కల్పన, ఎం ఈవో ఆర్ నా రాయణ, ఎంపీడీవో సునీత, హెచ్ ఎం వెంకట్, మాజీ సర్పంచ్ సోన్టేక్ బాలాజీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఇస్లాంనగర్ పాఠశాల సందర్శన
ఇచ్చోడ, డిసెంబర్ 27 : మండలంలోని ఇస్లాంనగర్, ప్రాథమిక మోడల్ పాఠశాలను శ్రీధర్ రెడ్డి డీఈవో ప్రణీతతో కలిసి మంగళవా రం సందర్శించారు. ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. జనవరి 5న సీఎం కేసీఆర్ సిరికొండ మండలంలోని పొన్న సుంకిడి, ఇచ్చోడ మండలంలోని ఇస్లాంనగర్, అడెగామ(బీ) మోడల్ పాఠశాలను ఆన్లైన్ ద్వారా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్క లు నాటారు. ఆయనన వెంట సెక్టోరియల్ జిల్లా అధికారి నారాయణ, ఈఈ అశోక్, ఎంవోఎంబీ డీఆర్పీ శ్రీపాల్, ఎంఈవో రాథోడ్ ఉదయ్రావు, ఈఈ అభినావ్ జాదవ్, హెచ్ఎం స్వప్న కుమారి, సర్పంచ్ చౌహాన్ రాందాస్ పాల్గొన్నారు.
నాణ్యమైన పనులు చేపట్టాలి
ఎదులాపురం,డిసెంబర్27 : పాఠశాలల్లో సుందరీకరణ పనులు నాణ్యతగా ఉండేలా చూడాలని టీఎస్ ఈడబ్ల్యూ ఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్, విద్య, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో ‘మనఊరు- మనబడి’ పనులపై మంగళవారం సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మనఊరు-మనబడి, మనబసీ’్త కార్యక్రమం కింద మొదటి దశలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మతులు , మౌళిక సదుపాయాలు ,మరుగుదొడ్లు , కిచెన్షెడ్లు, ప్రహరీలు నిర్మిస్తున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఈవో ప్రణీత, ట్రైనీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, అదనపు డీఆర్డీవో రవీందర్ రాథోడ్, సెక్టోరల్ అధికారి నారాయణ , ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.
బండలనాగాపూర్ పాఠశాల
భీంపూర్, డిసెంబర్ 27 : తాంసి మండలం బండలనాగాపూర్ పాఠశాలను శ్రీధర్రెడ్డి సందర్శించారు. రూ.21 లక్షల వ్యయంతో కొనసాగుతున్న పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ , డీఈవో ప్రణీత, ఎంపీపీ సురుకుంటి మంజుల , హెచ్ఎం శ్రీధర్రెడ్డి , సర్పంచ్ గంగు ల వెంకన్న, ఎస్ఎంసీ చైర్మన్ సంఘమిత్ర , ఉపాధ్యాయులు ఉన్నారు.