NR Narayana Murthy | ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో రెండేండ్లుగా ఐటీ సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ద్వారా సేవలందిస్తున్నారు. కోవిడ్-19 తీవ్రత తగ్గిపోయినందున ఉద్యోగుల వర్క్ ఫ్రం హోం కల్చర్ను ముగించాలని సూచించారు. తాను వర్క్ ఫ్రం హోం విధానానికి అభిమానిని కాదని ఓ ఐటీ సమ్మిట్లో వ్యాఖ్యానించారు.
ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడం తనకు అసలు ఇష్టమే లేదని నారాయణ మూర్తి అన్నారు. సిబ్బంది ఇండ్లకు పరిమితం కావడంతో ఆయా కంపెనీల ఉత్పాదకత తగ్గిపోయిందని చెప్పారు. వర్క్ ఫ్రం హోం వల్ల సిబ్బందిలో సృజనత్వం సాధ్యం కాదని, పనిలోనూ నాణ్యత ఉండదన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్ తలసరి ఆదాయం తగ్గిపోయిందన్నారు. 40 ఏండ్ల క్రితం ఏర్పాటైన బంగ్లాదేశ్ కంటే అది తక్కువ అని చెప్పారు.