Vidadala Rajini | ఏపీ ఎన్నికల వేళ నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని కిడ్నాప్ చేయడం గుంటూరులో కలకలం సృష్టించింది. గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ తరఫున విడదల రజినీ పోటీ చేస్తోంది. ఈ క్రమంలోనే అదే పేరు ఉన్న మరో మహిళ ఇండిపెండెంట్గా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యింది. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయల్దేరిన విడదల రజినీని కొంతమంది దుండగులు అడ్డగించి ఎత్తుకెళ్లారు. ఈ విషయం బయటకు తెలియడంతో స్థానికంగా సంచలనంగా మారింది.
గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే విడదల రజినీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. దీంతో ఆమెను దెబ్బకొట్టాలని భావించిన టీడీపీ నాయకులు.. విడదల రజినీ పేరుతో ఉన్న మహిళతో నామినేషన్ వేయించేందుకు కుట్ర చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. కాగా, సదరు మహిళను వైసీపీ నాయకులే కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కాగా, మహిళ కిడ్నాప్పై కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంలో రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని ట్రేస్ చేశారు. అయితే స్వచ్ఛందంగానే నామినేషన్ వేసేందుకు వేసేందుకు సిద్దమైనట్లు విడదల రజినీ చెప్పినట్లు సమాచారం.